Sunday, April 28, 2024

Flash: సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా

సీఎం కేసీఆర్ వేములవాడ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 31న వేములవాడ, కొండగట్టు వెళ్లాలని సీఎం నిర్ణయించకున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. వైద్యపరీక్షల కోసం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. పంటినొప్పి తీవ్రం కావడంతో వైద్యపరీక్షల కోసం ఢిల్లీ వెళుతున్నట్లు తెలసింది. ఈ నేపథ్యంలో వేములవాడ పర్యటన వాయిదా పడింది. కాగా, వేములవాడ, కొండగట్టు పుణ్య క్షేత్రాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement