Friday, May 10, 2024

సీఎం కేసీఆర్ కి ర్యాపిడ్ టెస్ట్ లో కరోనా నెగిటివ్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవి రావు ఇసోలేషన్ లో వున్న వ్యవసాయ క్షేత్రం లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ రాగా ఆర్‌టీపీసీఆర్ పరీక్ష ఫలితాలు గురువారం రానున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైదరాబాద్ సోమాజిగూడ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సిద్దిపేట ఫామ్ హౌస్‌లో విశ్రాంతి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement