Thursday, April 25, 2024

వాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయండి: మంత్రి హరీష్ కు సీఎం కేసీఆర్ ఆదేశం

రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల వాక్సినేషన్ డోసులు ఇచ్చామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అర్హులైన అందరికీ అతి త్వరగా వాక్సినేషన్ ఇవ్వనున్నామని వెల్లడించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని మంత్రి హరీష్ రావు తెలిపారు.

మరోవైపు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సహాయం తీసుకోని, వారితో సమన్వయం చేసుకుంటూ వాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖ మంత్రిని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్నిజిల్లాల మంత్రులు కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement