Saturday, April 20, 2024

సచివాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయ నిర్మాణ పురోగతిని పరిశీలిస్తున్నారు. సీఎం వెంట మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. సచివాలయ ప్రాంగణంలో కేసీఆర్‌.. పనుల గురించి ఇంజినీర్లను, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సచివాలయంలోకి సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టారు. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భవనం లోపల కలియతిరిగిన సీఎం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement