Thursday, April 18, 2024

రామాపురంలో నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

బోనకల్ : వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు సీఎం కేసీఆర్ నేటి ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరి ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ కాలినడకన బయల్దేరి రామాపురంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంటనష్ట వివరాలను స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. అధికారుల నుంచి నష్ట వివరాలను ఆయన సేకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement