Saturday, April 20, 2024

ఉపాధి హామీ పనుల్లో అపశృతి.. యువకుడు మృతి..

సిద్దిపేట : తొగుట మండలంలోని జప్తిలింగారెడ్డి పల్లి ఉపాధి హామీ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బ్యాగరి ఉమ్మరాజు (32) ఉపాధి హామీ పనులకు హాజరయ్యాడు. అనంతరం ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. మృతునికి భార్య సుజాత, పిల్లలు చందన శ్రీ (5) శివ మహేష్ (3) ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ శ్రీధర్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, గాందారి నరేందర్ రెడ్డి, బక్క కనకయ్య, కో ఆప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, ఏపీవో కిషన్ తదితరులు ఆసుపత్రికి చేరుకొని మృతుని కుటుంబీకులను పరామర్శించారు. జరిగిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement