Friday, April 26, 2024

తమిళనాడు శ్రీరంగం టెంపుల్‌లో ప్ర‌త్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్

తమిళనాడులోని తిరుచురాప‌ల్లికి సోమవారం ప్రత్యేక విమానంలో చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. త‌మ మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రాల‌తో రంగ‌నాథ స్వామి ఆల‌య పండితులు సీఎం కేసీఆర్ కు పూర్ణ‌కుంభంతో ఆహ్వానం ప‌లికారు.

సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు గ‌జ‌రాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అంత‌కుముందు తిరుచ్చి క‌లెక్ట‌ర్ శివ‌రాసు, త‌మిళ‌నాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్‌కు స్వాగతం ప‌లికి ఆల‌యంలోకి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌తోపాటు శ్రీ‌రంగం వెళ్లిన వారిలో సీఎం స‌తీమ‌ణి శోభ, మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, కుటుంబ స‌భ్య‌లు శైలిమ‌, హిమాన్షు, అలేఖ్య‌, శ‌శిరేఖ‌, వేణుగోపాల్‌, సునీల్‌, వాసుదేవారెడ్డి, స‌తీష్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement