Monday, April 29, 2024

శ్రీశైలంలో మలన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ NV ర‌మ‌ణ‌

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం వేకువజామున సుప్రభాతం మహామంగళ హారతి సేవలో సీజేఐ దంపతులు పాల్గొన్నారు. ఎన్.వి.రమణ దంపతులు  స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. 

కాగా,  భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆదివారం శ్రీశైలం మహాక్షేత్రానికి విచ్చేశారు.  సీజేఐకు ఆలయ మర్యాదలతో అర్చకులు, ఈవో లవన్న  జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement