Friday, May 3, 2024

25ఏళ్ల త‌ర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న ‘అర్చ‌న‌’

25ఏళ్ల త‌ర్వాత వెండితెర‌పై రీ ఎంట్రీ ఇస్తోంది సీనియ‌ర్ న‌టి అర్చ‌న‌. తెలుగులో ఆమె నిరీక్ష‌ణ‌, భార‌త్ బంద్, లేడీస్ టైల‌ర్,
చక్రవ్యూహం, పచ్చతోరణం, మట్టి మనషులు తదితర చిత్రాలు మంచి విజయం సాధించాయి. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వస్తోంది. పూరీ ఆకాశ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘చోర్‌ బజార్‌’ (Chor Bazaar). ఈ సినిమాలో అర్చన ఆకాశ్ (Akash Puri) తల్లిగా నటించనున్నట్లు సమాచారం. తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి. ఆంధ్రాపోరి, మెహబూబా నటించిన ఈ యంగ్‌ హీరో గతేడాది ‘రొమాంటిక్‌’ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. కాగా ఇప్పుడు తన జోరును అలాగే కొనసాగించే పనిలో ఉన్నాడు. అందులో భాగంగా ‘చోర్‌ బజార్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గెహనా సిప్పీ కథానాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవన్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement