Tuesday, July 23, 2024

China Treatment – సెల్​ థెరపీ.. ఇక.. కంట్రోల్​లోనే షుగర్​​


ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్‌ వంటి ఇంజెక్షన్లు, మందులను తరుచూ వాడటం డయాబెటిస్‌ రోగులకు ఇబ్బందిగా మారింది. అంతేకాదు, డయాబెటిస్‌ చికిత్సకు ప్రపంచవ్యాప్తంగా 2021 ఒక్క ఏడాదిలోనే 966 బిలియన్‌ డాలర్లను రోగులు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో ఈ వ్యాధిని సమూలంగా నయంచేయడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే, డయాబెటిస్‌ చికిత్సలో చైనా పరిశోధకులు వేసిన ముందడుగు వైద్య శాస్త్రంలో కీలక మైలు రాయిగా చెప్పుకొంటున్నారు. డయాబెటిస్ కు కొత్త చికిత్సా విధానం ద్వారా చైనా సైంటిస్టులు చెక్​ పెట్టారు. సెల్ థెరపీ అనే కొత్త చికిత్సా విధానం ద్వారా మధుమేహాన్ని నయం చేసినట్లు చైనా షాంఘైలోని షాంఘై చాంగ్‌జెంగ్ హాస్పిటల్ పరిశోధకులు కీలక ప్రకటన చేశారు.

- Advertisement -

ఏమిటీ ప్రయోగం?

క్లోమంలోని కణజాలంపై షుగర్‌ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నదో కృత్రిమ అల్గారిథమ్‌ ద్వారా తొలుత విశ్లేషిస్తారు. అనంతరం రోగి రక్తంలోని మూల కణాలను (సీడ్‌ సెల్స్‌) తీసుకొని సెల్‌ థెరపీతో వాటిలో కొన్ని మార్పులు చేస్తారు. తర్వాత క్లోమంలో ప్రభావితం అయిన క ణాల స్థానంలో వీటిని (సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌) ప్ర వేశపెడతారు. అలా క్రమంగా రోగికి ఇచ్చే ఇ న్సులిన్‌, ఇతరత్రా మందుల మోతాదును తగ్గిస్తారు. 2021 జూలైలో తొలుత ఓ రోగికి ఇలా ‘సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ చేశామని, 11 వారాల వ్యవధిలోనే అతను ఇన్సులిన్‌, ఇతరత్రా మందుల వాడకాన్ని పూర్తిగా మానేశాడని చైనా పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటిస్‌ సంపూర్ణంగా నయమైనట్టు వెల్లడించారు. గడిచిన 33 నెలలుగా సదరు వ్యక్తి ఇన్సులిన్‌ తీసుకోవట్లేదని వివరించారు. చైనాలోని చాంగ్‌జెంగ్‌ దవాఖాన, రెంజీ దవాఖాన వైద్యులు సంయుక్తంగా ఈ ప్రయోగం చేశారు. ఈ వివరాలు ‘సెల్‌ డిస్కవరీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

వైద్య పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం

డయాబెటిస్ నిర్మూలన కోసం రూపొందించిన సెల్ థెరపీ ఆధునిక వైద్య విధానంలో కొత్త ట్రీట్మెంట్ అవుతుందని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ సెల్ థెరపీ ఎంతో మంది రోగులకు మేలు చేయబోతుందని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం సెల్యులార్, ఫిజియోలాజికల్ సైన్సెస్ విభాగం అధినేత తిమోతీ కీఫెర్ వెల్లడించారు. దశాబ్దం పాటు కొనసాగిన ఈ పరిశోధనలో కీలక ఫలితాలు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

టాబ్లెట్లు, ఇంజెక్షన్లకు ఇకపై చెక్!

వాస్తవానికి మధుమేహంతో చాలా కాలం బాధపడే వారికి చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని పలు అవయవాల మీద ఎఫెక్ట్ పడుతుంది. డయాబెటిస్ ముదిరితే గుండె, కిడ్నీతో పాటు కంటి సమస్యలు ఏర్పడుతాయి. దీంతో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకునేందుకు బాధితులు టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన సెల్ థెరపీతో టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ తప్పే అవకాశం ఉంది.

అత్యధిక డయాబెటిక్ పేషెంట్లు ఉన్న దేశం చైనా

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డయాబెటిక్ పేషెంట్లలో ఎక్కువ మంది చైనాలోనే ఉన్నారు. డ్రాగన్ కంట్రీలో ఏకంగా 140 మిలియన్ల మంది డయాబెటిస్ పేషెంట్లు ఉన్నట్లు అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ వెల్లడించింది. సెల్ థెరపీ ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తే వారందరికీ మేలు కలిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement