Thursday, April 25, 2024

పిల్ల‌ల్ని క‌నండి.. ఇంక్రిమెంట్ లు తీసుకోండి.. సీఎం ప్రేమ్ సింగ్ త‌మాంగ్

ప్ర‌భుత్వ ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్ల‌ల్ని కంటే వారికి ఎక్కువ ప్రోత్సాహ‌కాలు అందుతాయ‌ని చెప్పారు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ త‌మాంగ్. అంతేకాదు మూడో పిల్లాడ్ని కంటే డబుల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఐవీఎఫ్ ద్వారా తల్లికి అయ్యేందుకు అవసరమైన డబ్బును కూడా ఇవ్వనున్నట్లు స్వయంగా సీఎం ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ప్రకటించ‌డం విశేషం.ఐవీఎఫ్‌ ద్వారా పిల్లల్ని కనే ఉద్యోగినులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తమాంగ్‌ వెల్లడించారు. ఐవీఎఫ్‌ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 38 మంది మహిళలు గర్భం దాల్చారని, కొందరు తల్లులు కూడా అయ్యారని తెలిపారు. కాగా, సర్వీసులో ఉన్న మహిళలకు 365 రోజుల ప్రసూతీ సెలవులు ఇస్తున్నారు.

మగ ఉద్యోగులకు 30 రోజుల పితృత్వ సెలవులు తీసుకునేందుకు అనుమతిస్తున్నారు. రోజు రోజుకి తగ్గిపోతున్న తమ జాతి జనాభాను పెంచుకునేందుకే ఈ ప‌థ‌కాల‌ని చెప్పారు. దక్షిణ సిక్కింలోని జోరెథాంగ్‌ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ పాల్గొన్నారు. సిక్కిం రాష్ట్రంలో జనాభాను పెంచేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్‌, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్‌ ఇక్రిమెంట్‌ తో పాటు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతిస్తామని కూడా చెప్పారు. ఇటీవలికాలంలో సంతనోత్పత్తి రేటు చాలా తగ్గిపోయిందని విచారం వ్యక్తం చేస్తూ.. పిల్లల్ని కనే ఉద్యోగులకు ప్రోత్సాహాకాలు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement