Wednesday, May 1, 2024

అధికారం కోసం పాకులాడుతోన్న చంద్ర‌బాబు – మంత్రి గుడివాడ అమ‌ర్నాధ్

ఉత్తరాంధ్ర ముఖ ద్వారం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తు నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు అని గ‌ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు. గతంలో విశాఖ వస్తే ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి కొట్టారు.. సిగ్గు లేకుండా మళ్లీ ఏం ముఖం పెట్టుకుని వచ్చారో తెలియడం లేదన్నారు… బాదుడే బాదుడు అనే కంటే తెలుగుదేశం బాధలే బాధలు అని పేరు పెట్టుకుంటే బాగుండేది… చంద్ర బాబు తను తన కొడుకు కోసమే తాపత్రయంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నార‌న్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని నిల‌దీశారు. ఎన్ని కష్టాలలో ఉన్నా ప్రజల‌ సంక్షేమమే ముఖ్యమని భావించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు..కరోనా సమయంలో కూడా ప్రజలకు భ‌రోసా కల్పించార‌న్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎంతపెంచారో ప్రజలు ఇప్పటికీ మరిచి పోలేదు… అధికారం కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు.. అది కలగానే మిగిలిపోతుంద‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement