Friday, May 3, 2024

పీఎస్ ఎదుటే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం.. విస్మయాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు

గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ దుండగులు ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నారని తెలిసి తాను దిగ్భ్రాంతి చెందానని, ఎంతో బాధ పడ్డానని తెలిపారు. తాడికొండలో పోలీస్ స్టేషన్ ఎదుటే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని… కానీ ఈ రాజకీయ హింసను అరికట్టేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు. రోజురోజుకు రాజకీయాలు దిగజారిపోతుండటం బాధాకరమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసినంత మాత్రాన ఆయన కీర్తిని పాడుచేయలేరని చెప్పారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement