Saturday, September 21, 2024

కరోనా వ్యాక్సినేషన్‌ తీరుపై ఈనెల 8న టీడీపీ నిరసనలు

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీకాలు వేయండి… ప్రాణాలు కాపాడండి అనే నినాదాలతో నిరసనలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలో కరోనా అధికంగా ఉన్న 33 జిల్లాల్లో 7 జిల్లాలు ఏపీలోనే ఉన్నాయని అన్నారు. వ్యాక్సిన్ తప్ప కరోనా నియంత్రణకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం 13 లక్షల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చిందని ఆరోపించారు. అటు చంద్రన్న బీమా ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు వచ్చేవని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement