Friday, May 3, 2024

ధాన్యం కొనుగోళ్లలో గోల్ మాల్ పై సీబీఐ విచారణ జరపాలి : రేవంత్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో గోల్ మాల్ అంశంపై సీబీఐ విచారణ జరపాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, మధుయాష్కీ, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్, పొన్నం, బలరామ్ నాయక్ లు కలిశారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రైతుల సమస్యలపై గవర్నర్ కు నివేదిక ఇచ్చామన్నారు. ధాన్యాన్ని 30శాతం తక్కువ రేట్లకే మిల్లర్లు కొన్నారన్నారు. దీని వల్ల రైతులకు రూ.2వేల కోట్లు నష్టం వచ్చిందన్నారు. ఏ రైతు ఎంత ధాన్యం అమ్మాడో మిల్లర్ల దగ్గర వివరాలున్నాయన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement