Thursday, May 2, 2024

Udupi: కారు బోల్తా.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

కారు బోల్తాపడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో చోటుచేసుకుంది. ఆయన ప్రమాణిస్తున్న కారు టైరు పేలడంతో, వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి శనివారం మంగళూరు నుంచి శృంగేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు ఉడిపి జిల్లా కర్కల తాలూకాలోని మియారు బ్రిడ్జి సమీపంలోని నల్లూరు క్రాస్ ముడారు ప్రాంతంలోకి చేరుకోగానే టైరు పేలింది. దీంతో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనపై స్థానిక కర్కల పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే ఈప్రమాదంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement