Thursday, April 25, 2024

రాయ‌ల‌సీమ‌ను 14జిల్లాలు చేయాల‌ని – బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్

రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాలు చాలా పెద్ద‌వ‌ని , అందుకే రాయ‌ల‌సీమ‌ను 14జిల్లాలుగా చేయాల‌ని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో ని 13 రాష్ట్రాల వైశాల్యం కంటే రాయలసీమ వైశాల్యం పెద్దది.. అనంతపురం, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కటి నాలుగు జిల్లాలుగా చేయాలన్నారు ఎన్టీఆర్ ప్రజల వద్దకు పాలన తెస్తే.. జగన్ ప్రజలకు దూరంగా పాలన సాగిస్తున్నాడని ఫైర్ అయ్యారు. జగన్ తుగ్లకా జగ్లకా అర్థం కావడం లేదు.. కర్నూల్ జిల్లాలో ఆదోని, డోన్ జిల్లాలుగా చేయాలని డిమాండ్ చేశారు. కడప, చిత్తూరు జిల్లాలో మూడు జిల్లాలుగా చేయాలన్నారు. అధోనిని జిల్లా చేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం… మదనపల్లె జిల్లాగా చేయాలన్నారు. ప్రజల వద్దకే పాలన ఉండాలని నాటి సీఎం ఎన్టీఆర్ పరిపాలన సాగించారని.. ఎంఆర్వో అని ఎన్టీఆర్ పెడితే..వైఎస్సార్ వచ్చి తహసీల్దార్ అని పేరు మార్చింద‌ని ఆగ్రహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement