Monday, May 6, 2024

Breaking : బ‌స్సు బోల్తా.. న‌లుగురు యాత్రికులు దుర్మ‌ర‌ణం

ప్ర‌మాద‌వ‌శాత్తు బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు యాత్రికులు మృతి చెందారు..మ‌ర‌ణించిన‌వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ సంఘ‌ట‌న తమిళనాడులో జరిగింది. తంజావూరు జిల్లాలో ఆదివారం ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు యాత్రికులు మరణించారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది. వీరంతా త్రిస్సూర్ నుంచి వేలంకన్ని చర్చికి యాత్ర కోసం వెళ్తున్నారు. ఇందులో ఉన్న నలబై మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. త్రిసూర్‌లోని ఒల్లూరు గ్రామానికి చెందిన 51 మంది (పిల్లలు, పెద్దలు కలిపి) భక్తులు బస్సులో శనివారం సాయంత్రం 7 గంటలకు వేలంకన్నికి బయలుదేరారు.

వీరంతా వేలంకణిలో ఉన్న ప్రసిద్ధ చర్చిలో ఆదివారం నిర్వహించే ప్రార్థనల్లో పాల్గొనాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ బస్సు ఉదయం తంజావూరుకు చేరుకునే సరికి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఈ ఘటనలో నలుగురు భక్తులు అక్కడికక్కడే మరణించారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది. మరణించిన వారిలో ఇద్దరిని 55 ఏళ్ల లిల్లీ, ఎనిమిదేళ్ల జెరాల్డ్‌గా పోలీసులు గుర్తించారు. మిగిలిన వారు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. 40 మంది కంటే ఎక్కువ మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా డ్రైవ‌ర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement