Saturday, May 18, 2024

Breaking : త‌ల‌స‌రి ఆదాయంలో ‘తెలంగాణ’ నెంబ‌ర్ వ‌న్ – సీఎం కేసీఆర్

వ‌న‌ప‌ర్తి బాగా అభివృద్ధి జ‌రుగుతోంద‌న్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ‌లో క‌రువు మాయ‌మైపోయింద‌న్నారు. విద్యుత్, నీటి కొర‌త లేకుండా అభివృద్ధి చేసుకున్నామ‌న్నారు. త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్ర‌గ‌తి ప‌థంలో ముందుకెళ్తోంద‌న్నారు. మ‌న ఊరు – మ‌న బ‌డి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. చిట్యాల‌లో మార్కెట్ యార్డును ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, స‌బితా ఇంద్రారెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా మ‌న ఊరు – మ‌న‌బ‌డి పైలాన్ ను ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..క‌ష్ట‌ప‌డి తెచ్చుకున్న రాష్ట్రాన్ని..ఇష్ట‌ప‌డి అభివృద్ధి చేసుకోవాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement