Monday, April 29, 2024

Breaking: ప్ర‌యాణాలు, ఫంక్ష‌న్ల‌కు దూరంగా ఉండాలే: ఐసీఎంఆర్ డీజీ భార్గ‌వ‌

‘‘దేశంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థుతులు మ‌ళ్లీ ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. దీంతో అన‌వ‌స‌ర‌మైన ప్ర‌యాణాలు, సామూహిక స‌మావేశాలు, కార్య‌క్ర‌మాల‌ను నివారించాలి. ఎమ‌ర్జెన్సీ కానీ జ‌ర్నీలు వాయిదా వేసుకోవాలి. పండుగలు, ఉత్స‌వాల వంటి వాటిని కూడా త‌క్కువ మందితోనే జ‌రుపుకోవాలి. జ‌నాలు గుమిగూడి ఉండ‌డం మ‌రింత ప్ర‌మాద‌క‌రం. ఇట్లాంటి సిచ్యుయేష‌న్‌లో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉంటేనే క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్ష‌ణ పొందగ‌లం’’ అని ఐసీఎంఆర్ డీజీ డాక్ట‌ర్ బ‌ల‌రామ్ భార్గ‌వ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ విష‌యంలో ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ట్వీట్టర్ ద్వారా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement