Saturday, April 20, 2024

Breaking – ప్ర‌ధాని మోడీకి ‘ప్రివిలేజ్ మోష‌న్ నోటీసులు’ ఇచ్చిన – టిఆర్ ఎస్ ఎంపీలు

టీఆర్ ఎస్ ఎంపీలు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై పార్ల‌మెంట్ లో ప్రివిలేజ్ మోష‌న్ నోటీసులు అందించారు. ప్రివిలేజ్ మోష‌న్ నోటీసుల‌ను రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌రల్ కి అంద‌జేశారు. కాగా ఈ నోటీసుల‌ను అందించిన వారిలో ఎంపీలు కేశవరావు, సంతోష్, బడుగుల లింగయ్యయాదవ్ ఉన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారని ప్రివిలేజ్ మోషన్ నోటీసుల్లో ఫిర్యాదు చేశారు. తలుపులు మూసేసి బిల్లును పాస్ చేశారనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘనల కిందికే వస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టే ముందు కావాల్సిన విధానాలన్నింటిని పార్టీలు పాటిస్తామని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్
 పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement