Saturday, July 27, 2024

Breaking : రూ.2కోట్లు విలువైన గంజాయి రవాణా-ప‌ట్టుకున్న పోలీసులు

శంషాబాద్ (ప్రభ న్యూస్) : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై రూ. 2 కోట్లు విలువైన 800 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై SOT శంషాబాద్, L&O శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్ SOT శంషాబాద్ .. శంషాబాద్ పోలీసులు అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్టు చేశారు. పక్క సమాచారంతో, స్పెషల్ ఆపరేషన్ టీమ్ , శంషాబాద్ జోన్, శంషాబాద్ పోలీసులతో కలిసి… ఆంద్ర/ఒడిస్సా బార్డర్ నుండి బులంద్ షహార్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ కి హైదరాబాద్ మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ నుండి – (800) కేజీల గంజాయి, (1) లారీ మరియు (2) మొబైల్ ఫోన్ ల‌ని స్వాధీనం చేసుకున్నారు.వాట‌న్నింటి విలువ రూ.2కోట్లు ఉంటుంద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement