Monday, May 20, 2024

Breaking: నో అలయెన్స్.. సింగిల్‌గానే వెళ్తాం.. ప్రింయాంక‌ గాంధీ ప్రకటన

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంట‌రిగానే పోటీకి దిగాల‌ని కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకునే ప్ర‌సక్తి లేద‌ని ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రకటన చేశారు. ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ప్రియాంక‌. ఎస్పీ లేదా బీఎస్పీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుంద‌న్న‌ ప్రచారం జరిగినప్పటికీ.. వాటిని కొట్టిపారేస్తూ ప్రియాంక గాంధీ క్లారిటీ ఇచ్చారు.

వచ్చే అసెంట్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు వ‌ద్ద‌ని కార్యకర్తలు తనను కోరారని.. ఆ మేరకు అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని హామీ ఇస్తున్నానని పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పారు ప్రియాంక గాంధీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement