Friday, May 17, 2024

Breaking : ప్లైఓవ‌ర్ పై నుంచి కిందికి ప‌డిన బ‌స్సు-మ‌హిళ మృతి-ఐదుగురి ప‌రిస్థితి విష‌మం

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో శుక్రవారం బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడటంతో ఒక మహిళ మృతి చెందింది.ఈ ఘ‌ట‌న‌లో పలువురు గాయపడ్డారు. అలీగఢ్ పోలీసు సూపరింటెండెంట్ కుల్దీప్ సింగ్ గుణవత్ మీడియాతో మాట్లాడుతూ..ఫరూఖాబాద్‌కు వెళ్లే బస్సు ఫ్లైఓవర్ నుండి పడిపోయినట్లు మాకు సమాచారం అందింది. బస్సులో దాదాపు 30-40 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. వీరిలో 25 మంది జిల్లా ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్ర‌మాదం అలీగఢ్‌లోని రోరావర్ ప్రాంతంలో ఢిల్లీ-కాన్పూర్-అలీగఢ్ జాతీయ రహదారిపై జరిగింది. బస్సు అతివేగంతో అదుపుతప్పి ఫ్లైఓవర్ పై నుంచి కిందపడింది. బస్సు కింద పడిన వెంటనే చక్రాలు ఎగిరిపోవడంతో ప్రయాణికులే కేకలు వేశారు. బాటసారులు బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ప్రయాణికులను అలీఘర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ .. జిల్లా ఆసుపత్రికి తరలించారు. . గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement