Thursday, April 25, 2024

breaking : ఇరాక్ ‘ప్ర‌ధాని’ ఇంటిపై డ్రోన్ దాడి..త‌ప్పిన ముప్పు..

ఇరాక్​ ప్రధానమంత్రి ముస్తాఫా అల్​-కధామీపై హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణహాని తప్పింది. దుండగులు ఆయన ఇంటిపై డ్రోన్​ దాడులకు యత్నించి విఫలమయ్యారు. బాగ్దాద్‌లోని ముస్తాఫా నివాసంపై పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్​ దాడికి దుండగులు విఫలయత్నం చేశారని ఇరాక్​ సైన్యం తెలిపింది. బాగ్దాద్​లో​ ప్రధాని నివాసం ఉన్న గ్రీన్​జోన్​ ప్రాంతంలో పెద్దఎత్తున కాల్పుల శబ్దం వినిపించిందని ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌ధానికి ఎలాంటి హాని జరగలేదని, క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.

ఈ దాడులకు పాల్పడినవారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పింది. ప్రధాని ముస్తాఫా కూడా ట్విట్టర్​ వేదికగా తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావద్దన్నారు. రాకెట్​ దాడులతో ప్రజల నమ్మకాన్ని ఎవరూ వమ్ము చేయలేరు. ప్రజల భద్రత కోసం, న్యాయాన్ని సాధించడానికి, చట్టాన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్న మన వీరోచిత భద్రతా దళాల దృఢత్వం, పట్టుదల ఏమాత్రం తగ్గదు. నేను బాగున్నాను. ప్రజలంతా సంయమనంతో ఉండాలని కోరుతున్నాను” అని ముస్తాఫా అల్-కధామీ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement