Thursday, May 9, 2024

Breaking : జహీర్‌పూర్ స్ల‌మ్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం – పేలిన గ్యాస్ సిలిండ‌ర్లు

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గుడంబాలోని జహీర్‌పూర్ స్ల‌మ్ ఏరియా అగ్నిప్రమాదం జరిగింది. కొద్దిసేపటికే మంటలు ఉగ్రరూపం దాల్చాయి. మంటలు చెలరేగడంతో గ్యాస్ సిలిండర్ పేలాయి. సమాచారం అందుకున్న దాదాపు అరడజను అగ్నిమాపక యంత్రాలు గంటన్నర శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. జహీరాపూర్ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. గుడంబా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ గుడిసెలో స్టవ్ వ‌ల్ల మంటలు చెలరేగాయి. దాంతో చుట్టుపక్కల ఉన్న గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి. మంటలను చూసి చుట్టుపక్కల వారు భ‌యాందోళ‌న‌కి గుర‌య్యారు.తొలుత బకెట్‌లోని నీళ్లు పోసి మంటలను అదుపు చేసేందుకు అక్కడి ప్రజలు ప్రయత్నించారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. సమాచారంతో పోలీసులు, ఇందిరానగర్, చౌక్, బీకేటీ అగ్నిమాపక కేంద్రాల నుంచి దాదాపు అరడజను వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. గంటన్నర శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాలనీలో చెత్తాచెదారం అధికంగా ఉండడంతో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతుండగా..అక్క‌డ‌ నివాసం ఉంటున్న మహిళలు, చిన్నారులను సురక్షితంగా తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రకారం, సకాలంలో మంటలు ఆర్పివేయబడ్డాయి, లేకపోతే మంటలు సమీపంలోని ఇళ్లపైకి వచ్చేవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement