Thursday, May 9, 2024

Breaking: కోర్టు కాంప్లెక్స్ లో పేలుడు, ఇద్దరు మృతి

పంజాబ్‌లోని లూథియానా కోర్టు కాంప్లెక్స్ లో జరిగిన పేలుడులో ఇద్దరు చనిపోయారు. ఈ పేలుడులో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బిల్డింగ్ రెండో ఫ్లోర్ లోని బాత్‌రూమ్‌లో ఈరోజు (గురువారం) మధ్యాహ్నం పేలుడు జరిగింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో బాత్‌రూమ్‌ గోడలు బద్దలయ్యాయి.

సమీపంలోని గదుల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా, లూథియానా నగరం నడిబొడ్డున జిల్లా కమిషనర్ కార్యాలయానికి సమీపంలోనే ఈ కోర్టు సముదాయం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement