Friday, May 3, 2024

Breaking : తూర్పుగోదావ‌రిలో కుల వివ‌క్ష‌ – 26మంది విద్యార్థుల‌ వెలివేత‌

తూర్పుగోదావ‌రి జిల్లా బ్ర‌హ్మ‌పురి గ్రామంలో కుల వివ‌క్ష చిచ్చు రేగింది. ఓ కులానికి చెందిన 26మంది విద్యార్థుల‌ను వెలివేశారు. కొత్త బిల్డింగ్ లో కాలు పెట్ట‌నివ్వ‌లేదు టీచ‌ర్. అగ్ర కులాల విద్యార్థుల‌కు అధునాత‌న సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేశారు. ఓ సామాజిక వ‌ర్గానికి మాత్రం నేల మీద త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లా బ్ర‌హ్మ‌పురి గ్రామంలో చోటు చేసుకుంది. మండ‌ల విద్యాశాఖ అధికారుల దాష్టీకానికి నిద‌ర్శ‌నం ఇది. సామాజిక రుగ్మ‌త‌ను పెంచుతున్నాయి విలువ‌మాలిన ప‌నులు. సౌక‌ర్యాల ఒడిలో అగ్ర‌కులాలు ఉన్నాయి. స‌మ‌స్య‌ల బ‌డిలో మ‌రో సామాజిక వ‌ర్గం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement