Friday, April 19, 2024

Breaking : న‌దిలో బోటు బోల్తా – ఎనిమిది మంది సేఫ్ – ఇద్ద‌రు గ‌ల్లంతు

ప‌ది మందితో వెళ్తున్న బోటు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మందిని ర‌క్షించారు. కాగా ఇద్ద‌రు గ‌ల్లంత‌య్యారు. ఈ ప్ర‌మాదం మ‌ధ్య‌ప్ర‌దేశ్ భింద్ జిల్లాలోని సింధ్ న‌దిలో జ‌రిగింది. న‌ది ఒడ్డుకు కేవ‌లం మీట‌ర్ల దూరంలో ఉండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దాంతో ఒడ్డున వున్న ప‌లువురు వ్య‌క్తులు వారిని ర‌క్షించేందుకు న‌దిలో దూకారు. కాగా ఎనిమిది మందిని రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన స్థానిక నివాసి ద్రౌపతి బాఘేల్ (16), ఓం బాఘేల్ (13) గ‌ల్లంత‌య్యారు. వారి కోసం గాలిస్తున్నామ‌ని ఎస్ఐ న‌రేంద్ర సింగ్ కుష్వాహా వెల్ల‌డించారు. భింద్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో ప్రమాదం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement