Thursday, April 18, 2024

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను దారి మళ్లించేందుకే కేసీఆర్ కుట్ర‌లు : బండి సంజ‌య్

ప్రజల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పనిచేస్తుందని.. ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులన్నీ సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నయని.. ఆయ‌న‌ ఆరోపించారు.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనన్న బండి సంజయ్.. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారుని, అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నల్గొండ, కరీంనగర్ లో తనపైనా, ఆర్మూర్ లో ఎంపీ అరవింద్ పై జరిగిన దాడులు సీఎం కుట్రలో భాగమే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నాగేశ్వర్ రావు అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి.. హత్య చేసేందుకు కుట్ర చేశారని.. స్థానిక సీఐ బూతులు తిడుతూ బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించాడని బండి సంజయ్ ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement