Saturday, September 21, 2024

Breaking : నామినేటెడ్ పోస్టుల్లో 51శాతం ప‌ద‌వులు మ‌హిళ‌ల‌కే ఇచ్చాం – సీఎం జ‌గ‌న్

నామినేటెడ్ పోస్టుల్లో 51శాతం ప‌ద‌వులు మ‌హిళ‌ల‌కే ఇచ్చామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. 51శాతం మ‌హిళ‌ల‌కు ప‌దవులు ఇచ్చిన ప్ర‌భుత్వం మాదేన‌ని అన్నారు. ఏపీలో ఘ‌నంగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని జ‌రిపింది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు విజ‌య‌వాడ‌ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో స‌భ‌ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అథితిగా సీఎం జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ..డిప్యూటీ సీఎం, హోం మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చామ‌ని తెలిపారు జ‌గ‌న్. మ‌హిళ‌ల‌కు 50శాతం ప‌ద‌వులు ఇవ్వాల‌ని చ‌ట్టం చేశామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement