Thursday, May 16, 2024

Breaking: దోస్తుల మధ్య ఘర్షణ.. కత్తితో గొంతు కోసి కాళ్లు, చేతులు నరికి అడవిలో పడేశారు

14 ఏళ్ల బాలుడిని అతని దోస్తులే దారుణంగా చంపేశారు. ఆ బాలుడి గొంతు కోసి, చేతులు.. కాళ్లు నరికేశారు. పైగా ఆ డెడ్ బాడీని గోనె సంచిలో మూటగట్టి అడవిలో పడేశారు. ఈ ఘటన జార్ఖండ్ లోని డియోఘర్ జిల్లాలో ఈ రోజు వెలుగుచూసింది. మొన్న రాత్రి (మంగళవారం) నుంచి తమ కుమారుడు కనిపించడం లేదని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లెయింట్ చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు విచారణలో భాగంగా ఆ బాలుడి దగ్గరి ఫ్రెండ్ ని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు.

ఈ విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జసిదిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహిణి గ్రామంలో తమ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నట్టు మృతుడి దోస్త్ కుమార్ తెలిపాడు. అక్కడి నుంచి కుమ్రాబాద్ స్టేషన్ రోడ్‌కు వెళ్లామని, మరో స్నేహితుడు అవినాష్ (19) తమతో కలిసి వచ్చాడని వివరించాడు. కాగా, ఈ ముగ్గురూ పలంగ పహాడ్ జంగిల్ వైపు వెళుతుండగా అవినాష్ తో వాగ్వాదం జరిగిందని.. ఉన్నట్టుండి ఆగ్రహానికి గురైన అవినాష్ కత్తి తీసి పొడిచాడని పోలీసుల విచారణలో తెలిసింది.

అంతేకాకుండా ఆ బాలుడి గొంతు కోశాడని, కాళ్లు, చేతులు నరికి గోనెసంచిలో మూటగట్టి సమీపంలోని అడవిలో పడేసినట్టు పోలీసు అధికారి తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement