Wednesday, May 15, 2024

Breaking: ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు

ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం గాల్లో ఉండగా… ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. చైనా వెళ్తున్న విమానం.. భారత్ భూబాగంలో ఉండగా బెదిరింపు కాల్ వచ్చింది. ప్రయాణికులతో చైనా వెళ్తున్న ఈ విమానం భారత గగనతలంలో ఉండగా ఈ సమాచారం అందింది. వెంటనే భారత వాయుసేన రంగంలోకి దిగింది. వాయుసేన ఫైటర్ జెట్​లు.. ఆ పాసింజర్ విమానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ విమానం చైనా దిశగా సాగుతోంది.ఇరాన్​కు చెందిన ఆ విమానం గమ్యస్థానం చైనా అని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా సంస్థలు ఆ విమానం కదలికల్ని నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. అయితే బెదిరింపు కాల్ చేసిన ఆగంతకుడిపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement