Friday, May 3, 2024

స‌ద్గురు జ‌గ‌దీష్ వాసుదేవ్ ఆశీస్సులు తీసుకున్నా – ప్ర‌గ్యా జెశ్వాల్

స‌ద్గురు జ‌గ‌దీష్ వాసుదేవ్ ను క‌లిసి ఆయ‌న ఆశీర్వాదం తీసుకుంది హీరోయిన్ ప్ర‌గ్యా జెశ్వాల్. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంది. గత ఐదారేండ్లుగా ప్రగ్యాకు ఒక్క హిట్టు కూడా లేదు. దీంతో నందమూరి నటసింహం బాలక్రిష్ణ సరసన ‘అఖండ’మూవీలో నటించింది. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో ప్రాగ్యా కేరీర్ లో రెండో హిట్ పడింది. మళ్లీ తన హవాను కొనసాగిస్తోంది. అటు హిందీలోనూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. 2104లోనే ‘టిటూ ఎంబీఏ’ చిత్రంతో నార్త్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా.. ఇటీవల సల్మాన్ ఖాన్ తో ‘మే చలా’ మ్యూజిక్ వీడియో సాంగ్ లో నటించింది. అఖండ హిట్ తర్వాత.. ఈ సాంగ్ కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ జోష్ లో మున్ముందు బాలీవుడ్ లోనే సెటిలైన అవ్వొచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ తన స్నేహితురాలితో కలిసి తమిళనాడులోని కోయంబత్తూరులో గల ఆదియోగి స్టాచ్యూను సందర్శించారు. మహా పర్వదినాన్ని పురస్కరించుకొని సద్గురు జగదీశ్ వాసుదేవ్ కూడా అక్కడి రావడంతో ఆయన్ను కలిసి ఆశీర్వాదం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకుంది. ఫొటోలు షేర్ చేస్తూ సద్గురును కలవపడం పట్ల ఆమె అనూభూతిని తెలియజేసింది. ‘సద్గురుతో మహాశివరాత్రి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. నిజంగా ఇదొక అపురూపమైన అనుభవం. సాయంత్రపు శక్తివంతమైన ధ్యానాలు, ఆదియోగి (శివుడికి) చేసిన ప్రార్థనలు, అసాధారణమైన ప్రదర్శనలు, ఆనందకరమైన గానాలు నన్ను ఆకర్షించాయి. ముఖ్యం అక్కడి నృత్యం ఆరోజును మరింత గుర్తుండిపోయేలా చేసిందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement