Friday, May 17, 2024

తెలంగాణ భారత్ లో ఉందా ? పాకిస్థాన్ లో ఉందా?

బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భారతదేశంలో ఉందా ? లేక పాకిస్థాన్ లో ఉందా? అని ప్రశ్నించారు. ఛత్రపతి శివాజీకి జై అంటే నేరమా? నిలదీశారు. హైదరాబాద్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఎంఐఎం టెర్రర్ కారిడార్ ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. ఎంఐఎంకు ప్రభుత్వం, పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. హిందువుల గురించి మాట్లాడితే మతపిచ్చా? అని మురళీదర్ రావు ప్రశ్నించారు. బాధ్యత రహితంగా మాట్లాడితే ఖబడ్ధార్ కేసీఆర్ అని హెచ్చరించారు. మతోన్మాదానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఒవైసీ, కేసీఆర్ రాజకీయాలు నడవవు అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement