Friday, May 3, 2024

వైరల్ ఫోటో: తెలంగాణను బీజేపీ చీట్ చేసింది

హైదరాబాద్‌లో వెలసిన ఓ ఫ్లెక్సీ తెలంగాణ బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. కంటోన్మెంట్‌లోని సికింద్రాబాద్ క్లబ్ ఏరియా వద్ద బీజేపీకి వ్యతిరేకంగా పెట్టిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏముంది అంటే..

బీజేపీ తెలంగాణను చీట్ చేసిందని.. ఇప్పటికే పసుపు బోర్డు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెడికల్ కాలేజీలు, ఖాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టు విషయాల్లో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసిందని అందులో ప్రస్తావించారు. కాగా ఈ హోర్డింగ్ చూసిన ప్రజలు ఇది నిజమేగా అని మాట్లాడుకోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement