Wednesday, May 15, 2024

Bandi Sanjay: కేసీఆర్ చెప్పేవన్నీ జూటా మాటలే.. ప్రధానిని చూస్తే వణుకు

ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. కేసీఆర్ చెప్పేవన్నీ జూటా మాటలే అని అన్నారు. 2016లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏడాదిలో పనులు పూర్తి చేస్తామన్నారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదని విమర్శించారు. కానీ ఏడాదిలోపు ప్రగతిభవన్ ను నిర్మించారని మండిపడ్డారు. రాజ్యాంగతం తిరిగి రాయడమనే మీ తాత తరం కూడా కాదన్నారు. కేసీఆర్ మాటలు ఎవరూ నమ్మొద్దన్నారు.

ప్రధాని మోదీ వస్తుండనగానే కేసీఆర్ కు జ్వరం వచ్చిందన్నారు. ప్రధాని పేరు ఎత్తగానే కేసీఆర్ గజగజ వణుకుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నేతల ట్వీట్లకే పరిమితమవుతారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలకే కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వరని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతల మాటల పిట్టలదొర మాటలు అని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement