Saturday, May 4, 2024

WTC Final: బాలాసోర్ రైలు ప్రమాదం.. నల్ల బ్యాడ్జీలు ధరించి క్రికెటర్స్ నివాళి

ఇటీవలే ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అత్యధిక సంఖ్యలో మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో వారి మృతికి సంతాప సూచకంగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలో అడుగు పెట్టారు. ఇంగ్లాండ్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్, ఆసిస్ ఆటగాళ్లు జాతీయ గీతాలాపన సందర్భంగా భుజానికి నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలో అడుగు పెట్టారు. అంతకంటే ముందు కాసేపే మౌనం పాటించి నివాళులర్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement