Thursday, April 25, 2024

లఖింపూర్‌ఖేరి కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్

లఖీంపూర్ ఖేరీ టికునియాలో రైతులను జీపుతో తొక్కించి చంపిన కేసులో హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను ఊర‌ట ల‌భించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ మంజూరైంది. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కొడుకు ఆశిష్‌ మిశ్రాకు అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ బెయిల్‌ మంజూరు చేసింది. రైతులను కారుతో ఢీకొట్టి, పలువురి మృతికి కారణమైన కేసులో గతేడాది అక్టోబర్‌ 9న ఆశిష్‌ మిశ్రాను అరెస్ట్ చేశారు పోలీసులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement