Tuesday, April 30, 2024

Breaking: సంగారెడ్డిలో ఆటో డ్రైవర్ దారుణ హత్య

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. రామచంద్రాపురంకు చెందిన ఆటో డ్రైవర్ వినయ్(27) దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లపూర్ రైల్వే కల్వర్ట్ వద్ద మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గత రెండు రోజుల క్రితం ఆటో చోరీ విషయంలో వినయ్‌ను ఇద్దరు ఆటో డ్రైవర్లు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement