Tuesday, May 7, 2024

Followup: భూపాలపల్లిలో దారుణం.. అనుమానంతో భార్యను చంపేసి, ఆపై భర్త ఆత్మహత్య

భూపాలపల్లి, ప్రభన్యూస్‌ ప్రతినిధి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాంనగర్‌ కాలనీలో ఆదివారం కుటుంబ కలహాలతో భార్యపై భర్త అతికిరాతకంగా దాడి చేసి అనంతరం భర్త ఆత్మహత్యకు పాల్పడ్డ దారుణ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సుభాష్‌కాలనీ రామ్‌నగర్‌కు చెందిన అంబాల రమేష్‌(35) కేటీకే ఓపెన్‌ కాస్ట్‌లో సైట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రమేష్‌కు ఇద్దరు భార్యలు శైలజ, రాజ్యలక్ష్మీలు ఉన్నారు. మొదటి భార్య శైలజకు పిల్లలు లేరని గత కొద్ది నెలల క్రితం కాటారం మండలం రుద్రారం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(30)ని వివాహం చేసుకున్నాడు. గత కొద్ది నెలల నుండి సుభాష్‌ కాలనీరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా శనివారం రాత్రి రమేష్‌ అతని రెండవ భార్య రాజ్యలక్ష్మీతో గొడవపడ్డారు. ఆమెపై అనుమానంతో తెల్లవారుజామున పేనంతో, కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రాజ్యలక్ష్మీ కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు గమినించి వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి వుంది. తీవ్ర రక్తస్రావంతో పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 108 ద్వారా రాజ్యలక్ష్మీని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన భార్య చనిపోయిందేమోనని భావించిన అంబాల రమేష్‌ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఆదివారం 5 ఇంక్లైన్‌ జామాయిల్‌ తోట సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే మద్యం మత్తులోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అంతా భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ఏ. రాములు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పరకాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజిరెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement