Thursday, April 25, 2024

సీఎం జగన్ ఫ్యామిలీ మొత్తం మత ప్రచారకులే

వైసీపీ పాలనలో ఏపీలో క్రిస్టియన్‌ల పాలన నడుస్తోందని ఏపీ సాధు పరిషత్ తీవ్ర విమర్శలు చేసింది. గత చరిత్రలో మహమ్మదీయుల, ఆంగ్లేయుల పాలనను మించి క్రిస్టియన్ పాలన కొనసాగిస్తూ దేవాలయాలపై దాడులను సమర్థిస్తూ సీఎం జగన్, అమ్మ, చెల్లి, బావలు మత ప్రచారం చేస్తూ చాపకింద నీరులా హిందూ మతాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. టీటీడీ ఛైర్మన్‌గా శ్రీవారి సేవలో ఉన్న సుబ్బారెడ్డి యేసు, అల్లా, వెంకన్న దయవల్ల అనే పదాన్ని వాడుతూ సర్వ మతాలకు ప్రతినిధిలా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్న శ్రీవారి ఉచిత దర్శనాన్ని కరోనా సాకుతో రద్దు చేసి రూ.300 దర్శనాన్ని ప్రోత్సహించడంలో వ్యాపార ధోరణి కనిపిస్తుందని దుయ్యబట్టారు. తిరుపతి ఉపఎన్నికలలో మత ప్రచారకుల పార్టీకి ఓటు వేయరాదని, హిందూ మనోభావాలను గౌరవించే పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement