Sunday, April 28, 2024

తెలంగాణ మంత్రులు అతిగా మాట్లాడుతున్నారు: ఏపీ సీఎం జగన్

తెలంగాణ మంత్రులు అతిగా మాట్లాడుతున్నారు: ఏపీ మంత్రి మండలి భేటీలో సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ మధ్య జల వివాదాలపై మంత్రివర్గ భేటీలో జగన్ మండి పడ్డారు. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నానన్న జగన్.. ఏపీ వాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లే అని అన్నారు. ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి పేర్కొన్నారు. ‌తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారన్న సీఎం.. జల వివాదాలపై ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని సూచించారు. తెలంగాణ విద్యుదుత్పత్తిపై మరోసారి లేఖ రాయాలని జగన్ నిర్ణయించారు. నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీకి లేఖ రాయాలని ఆదేశించారు. జల వివాదాలపై ప్రధానికి కూడా లేఖ రాయాలని జగన్‌ నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement