Friday, April 26, 2024

టీఎస్‌పీఎస్సీ లీకేజీ – మరొకరి అరెస్ట్…. ప్రశాంత్ కోసం లూకౌట్ నోటీస్

హైదరాబాద్ – టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. రేణుక భర్త డాకియా ద్వారా ఏఈ ప్రశ్నాపత్రం పొందిన తిరుపతినీ సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.ఇతడు ఆ ప్రశ్నాపత్రాన్ని రాజేందర్‌కు విక్రయించినట్టు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా. . గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్‌ రెడ్డి తన బావ ప్రశాంత్‌కు విక్రయించగా.. అతడు న్యూజిలాండ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి గతేడాది అక్టోబర్‌ 16న గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ రాసినట్టు నిర్థారించుకున్నారు. ఈ పరీక్షలో .ప్రశాంత్‌కు 100కు పైగా మార్కులు వచ్చినట్టు గుర్తించారు. అయితే, నిందితుడు రాజశేఖర్‌ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ప్రశాంత్‌కు సిట్‌ అధికారులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 15కి చేరింది.

మరోవైపు, 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులను పిలిచి విచారిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ అధికారుల నుంచి వారి సమాచారం సేకరించి ఇప్పటివరకు 65మంది అభ్యర్థులను పిలిచి విచారించగా.. మరికొందరిని ఫోన్‌లో సంప్రదించినట్టు సమాచారం. వీరిలో అనేకమంది అభ్యర్థులు చాలా సార్లు ప్రిలిమ్స్‌ రాయడం, ఎప్పటి నుంచో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారే ఉన్నట్టు తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement