Sunday, May 5, 2024

FIRE: కాలిపోయిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్..

ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోతున్న ఘటనలు వరుసపెట్టి వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిపోయింది. తాజాగా తమిళనాడులోని హోసూరులో మరో ప్రమాదం జరిగింది. స్కూటర్‌‌పై ప్రయాణిస్తున్న సమయంలో సీటు కింద అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. గమనించిన స్కూటర్ యజమాని సతీష్ కుమార్ అప్రమత్తమై స్కూటర్‌ను ఆపేసి పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, స్కూటర్ వెనకభాగం పూర్తిగా కాలిపోయింది.

తాను ఈ వాహనాన్ని గతేడాదే కొనుగోలు చేసినట్టు యజమాని సతీష్ కుమార్ చెప్పారు. కాగా, బ్యాటరీల్లో నాణ్యతా లోపాల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వరుస ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. బ్యాటరీల విషయంలో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తయారీదారులను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement