Monday, April 29, 2024

గుజ‌రాత్ లో మ‌రోసారి భూకంపం..

మ‌రోసారి గుజ‌రాత్ లో భూప్ర‌కంప‌ణ‌లు చోటు చేసుకున్నాయి. 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. రాజ్కోట్ కు 270 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈరోజు మధ్యాహ్నం 3:21 గంటలకు భూకంప కేంద్రం నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. ఈ భూకంప తీవ్రతతో ఎవరికి ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. గత వారం సైతం గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో రెండు రోజులలోనే మూడు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూమి స్వల్పంగా పంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఇలా వరుసగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement