Saturday, May 18, 2024

అన్నా, బాగున్నావా.. ఈటలను పలకరించిన కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శాసనసభ సమావేశాలు సోమవారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఉప ఎన్నికలో హుజురాబాద్‌ నుంచి బీజేపీ నుంచి విజయం సాధించిన మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి కేటీఆర్‌ కలిశారు. అన్నా బాగున్నావా.. అంటూ రాజేందర్‌ను కేటీఆర్‌ అప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌ను కూడా మంత్రి పలకరించారు. అనంతరం కాంగ్రెస్‌, ఎంఐఎం ఎమ్మెల్యేలతో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అభివాదం చేశారు. వారికి కేటాయించిన సీట్ల వద్దకే కేటీఆర్‌ వెళ్లి అప్యాయంగా పలకరించి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement