Friday, May 17, 2024

BREAKING: ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా వ్యాక్సిన్

మరోవైపు 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీళ్లందరికీ ఏపీ సర్కార్‌ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనుంది. ఈ మేరకు భారత్ బయోటెక్, హెటెరో ఎండీలకు సీఎం జగన్ ఫోన్ చేసి కొవాగ్జిన్ వ్యాక్సిన్, రెమిడెసివివర్ ఇంజెక్షన్ వయల్స్‌ను భారీ సంఖ్యలో పంపాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement