Saturday, May 4, 2024

ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతి తెలిపిన.. ఆనంద్ మహీంద్రా

ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. నరేంద్ర మోడీ తన తల్లి హీరాబెన్ పాదాలకు అభివందనం చేస్తున్న చిత్రాన్ని ఆనంద్ మహీద్రా ట్వీట్ చేశారు. ఈ ఫొటోతోపాటు ఆయన తన సానుభూతి తెలిపారు. తల్లి ఎంత వయోవృద్ధురాలైనప్పటికీ ఆమెను కోల్పోవడం అంటే మన ఆత్మలోని ఒక భాగం కోల్పోవడం వంటిదే. ప్రధానికి తన సానుభూతి’ అని తెలిపారు. ఓం శాంతి అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement