Wednesday, May 15, 2024

తుఫాను నిధులను దీదీ మేనల్లుడు నొక్కేశాడు:అమిత్ షా

బెంగాల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారంలో ఉన్న తృణముల్ కాంగ్రెస్ పై బీజేపీ నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బెంగాల్ లో పర్యటిస్తున్నారు బీజేపీ నేత హోం మంత్రి అమిత్ షా. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తీవ్రంగా విమర్శించారు షా. అంఫన్ తుపాను పరిహారం కింద పశ్చిమ బెంగాల్ కు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఇచ్చిందని, కానీ, అది జనమెవరూ చూడలేదని, ఎవరికీ అందలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆ మొత్తాన్ని ‘మేనల్లుడు’, ఆయన అనుచరులే పంచుకుతిన్నారని సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రాగానే సిట్ ఏర్పాటు చేసి వారు తిన్నదంతా కక్కిస్తామని అన్నారు. నిధులను కాజేసిన వారిపై దర్యాప్తు చేయిస్తామని, ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement